Posts

భగవద్గీత _పూర్వపరాలు

భగవద్గీత _పూర్వపరాలు                     ____ పిళ్లా కుమార స్వామి **************************             భగవద్గీత అంటే భగవంతుని గీత (పాట )అని అర్థం. మహాభారత కథలో కురు క్షేత్రంలో జరిగిన యుద్ధం ప్రారంభ సమయంలో పాండవ మధ్యముడైన అర్జునుడు తన ఎదుటి పక్షం లో ఉన్న బంధువులను గురువులను చూచి వారందరినీ తాను చంపడం ఇష్టం లేక బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు .ఆ సందర్భంలో అర్జునునికి రథసారథిగా ఉన్న శ్రీ కృష్ణునికి అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ లోని భావాలే భగవద్గీత. ఇది మహాభారతంలో భీష్మ పర్వం లో 700 శ్లోకాలతో ( పద్యాలతో) 18 భాగాలుగా ఉంది. దీనిని సంస్కృతంలో వ్యాసుడు రచించారని అందరూ నమ్ముతారు. అయితే క్రీ.పూ.1000 లలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా 8000 శ్లోకాలతో 'జయం' పేరుతో వ్యాసుడు ఒక కావ్యాన్ని రాస్తే, దానికి క్రీ. పూ. 400_ క్రీ.శ 400 మధ్యలో ఇతర పండితుల ద్వారా అనేక కథలను కలుపుతూ మహాభారతం గా రచింపబడినదని చరిత్రకారులు నిర్ణయించారు. ప్రారంభంలో భగవద్గీత మహాభారతంలో లేదని తన తదనంతర కాలంలో భగవద్గీతను మహాభారత యుద్ధ ఘట్టం ల...

భగవద్గీత

భగవద్గీత  గ్రంథాన్ని ఎవరు ఎప్పుడు రాసారు? ఆ కాలమానం లో ఏమి జరిగి ఉండవచ్చు,? రాయడానికి గల కారణాలు ఏమిటి.? రాస్తే ఒక్కసారే, ఒక రచయితే రాశారా లేక దఫాలు దఫాలు గా పలువురు రాశారా? దాన్ని మహాభారత ఇతిహాసం లో ఇరికించడం ఎందువలన జరిగింది..!?!  ఈ గ్రంథాన్ని గుర్తించి ప్రాముఖ్యం లోకి తెచ్చింది ఎవరు..!?!  గీత పై భాష్యాలు ఏంటి..!?!  భగవద్గీత రచనా కాలం, దాని వాడుక ప్రారంభం, సాంస్కృతిక-సామాజిక నేపథ్యం గురించి ప్రస్తుత ఆధునిక పరిశోధనలు (2020–2025 వరకు వచ్చిన ముఖ్యమైన పేపర్లు, పుస్తకాలు) ఏం చెబుతున్నాయో సంక్షిప్తంగా, నిజాలు ఏమిటో చూద్దాం. రచనా కాలం (Date of Composition) ప్రస్తుత అకాడ మిక్ కన్సెన్సస్ దాదాపు అన్ని ప్రముఖ ఇండాలజిస్టులు( భారత ఉపఖండం యొక్క చరిత్ర, సంస్కృతులు, భాషలు మరియు సాహిత్యాలను అధ్యయనం చేసే పరిశోధనకారులు)ఒప్పుకునేది... భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వం (అధ్యాయాలు 25–42) లోపలే ఇన్సర్ట్ చేయబడిన ఒక స్వతంత్ర ఉపనిషత్తు లాంటి టెక్స్ట్ గా గుర్తించబడింది. దీని మూల రూపం (core layers) క్రీ.పూ. 200 నుంచి క్రీ.శ. 200 మధ్య రచించబడింది. అతి తక్కువ మంది మాత్రం (traditionalists తప్ప) ...

భారత రాజ్యాంగం _ బౌద్ధం

Image
భారత రాజ్యాంగం _ బౌద్ధం          భారతదేశ తాత్వికచింతనను మలుపు తిప్పింది బౌద్ధం. ఆ బౌద్ధం  బోధించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సామాజిక న్యాయం, అహింస, సహనం వంటి ఆధునిక విలువల పైన ఆధారపడి భారతదేశ రాజ్యాంగం రూపొందించబడింది. భారత రాజ్యాంగం రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధమతం నుండి ప్రేరణ పొందారు.ఆయన సామాజిక న్యాయం, కుల వివక్ష నిర్మూలన వంటి విలువలను నొక్కి చెప్పారు. రాజ్యాంగం ఈ ఆదర్శాలను ప్రతిబింబిస్తుంది. వ్యక్తిని గౌరవించే లౌకిక రాజ్యాన్ని ప్రోత్సహిస్తుంది.          భారత రాజ్యాంగం 3 వ భాగంలో సమానత్వపు హక్కు ప్రకటించబడింది. 15 వ అధికరణం కుల, మత, లింగ వివక్షతలకు తావే లేదు అని ప్రకటించింది. అయితే రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఇన్ని దశాబ్దాల తరువాత కూడా ఇంకా ఈ దేశంలో బహిష్కృతులున్నారు. నిషిద్ధ మానవులున్నారు. వాళ్ల ఇళ్లు ఇంకా ఊరి బయటే ఉన్నాయి. వారి జీవనం ఇంకా వెలివాడల్లోనే మగ్గిపోతూ ఉంది. సమాజం ఇంకా ఆధునికం కాక పోవడం వల్లే ఇంకా బుద్ధుని బోధనలు గాని రాజ్యాంగం చెప్పిన రాజ్యాంగం లో రాసుకున్న విలువలు గాని ఇంకా ప్రజలు అందుకోల...

పుచ్చలపల్లి సుందరయ్య తాత్విక చింతన

పుచ్చలపల్లి సుందరయ్య తాత్విక చింతన       పుచ్చలపల్లి సుందరయ్య (1913–1985) భారత కమ్యూనిస్టు ఉద్యమానికి పునాది వేసిన గొప్ప తాత్విక నాయకులలో ఒకరు. ఆయన మార్క్సిజాన్ని ఒక ఆయుధంగా తీసుకుని, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన నాయకత్వం, తాత్విక దృక్పథం భారత కమ్యూనిస్టు చరిత్రలో ఆయనను విలక్షణంగా యోధునిగా నిలిపాయి.        ‌ సుందరయ్య, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం, అలగానిపాడు గ్రామంలో ఒక భూస్వామ్య కుటుంబంలో 1913, మే 1 న జన్మించాడు. తండ్రి వెంకటరామిరెడ్డి, తల్లి శేషమ్మ. తల్లిదండ్రులు ఇతనికి సుందరరామిరెడ్డి అని పేరు పెట్టారు. పెద్దయ్యాక రెడ్డి అనే కులచిహ్నాన్నిను తొలగించుకున్నాడు.ఇది అతని సామాజిక సమానత్వం పై విశ్వాసాన్ని తెలియజేస్తుంది. మనుషులంతా సమానమేనని తాను నమ్మిన సిద్ధాంతానికి అతను కట్టుబడినాడు. ఇప్పుడు అన్ని కులాల వారు తమ కుల గుర్తింపుకోసం తహ తహలాడుతూ తమ పేర్ల చివర కుల చిహ్నాలను అదేపనిగా పెట్టుకుంటున్నారు. సహచరులంతా అతన్ని ఆప్యాయంగా "కామ్రేడ్ పి.ఎస్." అని పిలిచేవారు.     ...

ఆర్యులు

ఆర్యన్లు వాస్తవానికి యూరేషియన్ స్టెప్పీస్ ప్రాంతం నుండి వలస వెళ్లిన ప్రజలు. సుమారు క్రీ.పూ. 2000-1500 మధ్యకాలంలో, వారు మధ్య ఆసియా నుండి ఉత్తర భారతదేశానికి వచ్చారని అనేక భౌగోళిక, భాషావివరణ శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ వలసలు భారత ఉపఖండంలో నూతన భాషా, సంస్కృతి, ధర్మచింతనలను అభివృద్ధి చేయడానికి దోహదపడ్డాయి. వేద సాహిత్యం భారతీయ ధార్మిక, సాంస్కృతిక జీవన విధానానికి మూలస్థంభం. ఈ వేదాలను నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించారు: 1. ఋగ్వేదం (క్రీ.పూ. 1500-1200): ప్రాచీన హిండు మతానికి ప్రథమ ఆధారం. ఇందులో భక్తి, యజ్ఞాలు, దేవతల ప్రార్థనల గురించి ఉన్నవి. 2. యజుర్వేదం (క్రీ.పూ. 1200-1000): ఇది యజ్ఞ విధానాలకు సంబంధించిన మంత్రాలను మరియు సూత్రాలను అందిస్తుంది. 3. సామవేదం (క్రీ.పూ. 1100-800): ఇందులో ప్రధానంగా సంగీతపూర్వకంగా పఠించాల్సిన మంత్రాలున్నాయి. 4. అథర్వణవేదం (క్రీ.పూ. 1000-700): ఆరోగ్య, వైద్య శాస్త్ర సంబంధిత మంత్రాలతో పాటు సామాజిక వ్యవస్థ గురించి వివరిస్తుంది. వేదాల అనంతరం, అరణ్యకాలు (క్రీ.పూ. 800-500) అనే గ్రంథాలు వెలువడ్డాయి. వీటిని అడవుల్లో తపస్సు చేసిన ఋషులు రచించారు. వీటి తర్వాత, ఉపనిషత్తులు...

bhagat singh

నేనెందుకు_నాస్తికుణ్ణయ్యాను (Why_I_am_an_Atheist ?)        __ భగత్ సింగ్.               __సర్వశక్తి సంపన్నుడూ, సర్వాంతర్యామీ, సర్వజ్ఞుడూ అయిన దేవుడి ఉనికిని నేను నమ్మకపోవడం అహంకారంవల్లనా? ఇది నాలో ఉదయించిన కొత్త ప్రశ్న.ఇలాంటి ప్రశ్నను ఎదుర్కొనవలసి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు.అయితే దైవం కన్నా నేనే గొప్ప అనే ఆధిక్యభావన నాలో ఉన్నందువల్లనే దేవుని ఉనికిని నిరాకరిస్తున్నానని , దేవుణ్ణి నమ్మకపోవడానికి కొంతవరకు నా అహంకారము కూడా కారణమని నా మితృలుకొందరు నాతోవున్న కొద్దిపాటి పరిచయాన్ని పురస్కరించుకొని మాటల సందర్భంగా నాతో సూచనగా అన్నారు.వీళ్ళు నామిత్రులని అనుకోవడం ఎంతవరకు సరైందో తెలియదు.ఈ సమస్య మాత్రం తీవ్రమైనదే.మానవ సహజమైన ఈ లక్షణాలకు నేను అతీతుణ్ణని గొప్పలు చెప్పుకోవడం లేదు.నేనూ మామూలు మనిషినే. అంతకుమించి మరేమీ కాదు. నేనేకాదు , ఎవరైనా అలా అనుకోలేదు.నా స్వభావంలో అహంకారం ఒక భాగం. ఈ బలహీనత నాలోనూ ఉంది.నా మిత్రులు నన్ను నియంత అని పిలిచేవాళ్ళు. నా ముఖ్య స్నేహితుడు బి.కె.దత్ కూడా అలాగే పిలిచేవాడు. కొన్ని సందర్ధాలలో నిరంకుశుడని నన్ను నిందించడంకూ...

తాత్విక చింతన

తాత్విక చింతన – ఒక పరిశీలన తాత్విక చింతన అనేది మన ఆలోచన విధానాన్ని, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానాన్ని ప్రతిబింబించే ఓ విస్తృతమైన విషయంగా చెప్పవచ్చు. ఇది మన జీవితం, నైతికత, జ్ఞానం, వాస్తవికత వంటి కీలకమైన అంశాలపై లోతైన పరిశీలన చేయడం ద్వారా అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిగత వైఖరి vs. తాత్విక చింతన ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా చూస్తాడు, అనుభవాలను ఎలా అర్థం చేసుకుంటాడు అన్నది అతని వ్యక్తిగత తాత్విక దృక్పథానికి చెందిన అంశం. అయితే తాత్విక చింతన అనేది మరింత విస్తృతమైనది, నిర్మాణాత్మకమైనది. ఇది కేవలం వ్యక్తిగతంగా అనుభవించే విషయాలకే పరిమితం కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రామాణికమైన నిజాలను అన్వేషిస్తుంది. తాత్విక చింతనలో వ్యక్తిగత జీవన అనుభవాలే కాకుండా, సమాజంలోని వ్యవస్థలు, విశ్వంలోని సూత్రాలు, బుద్ధి, నైతికత, మనిషి ఉనికి వంటి సమస్యలను కూడా చర్చిస్తారు. అందువల్ల, తాత్విక చింతన అంటే కేవలం ఒక వ్యక్తి అనుభవాలను, అభిప్రాయాలను మాత్రమే కాకుండా, సమస్త మానవ సమాజానికి సంబంధించిన విలువైన ప్రశ్నల్ని పరిష్కరించే దృక్పథంగా మారుతుంది. తాత్విక చింతన – పరిమితులు & విస్తరణ ఆధునిక విజ్ఞానశాఖలన్నీ తత్వశాస్త్...