Posts

Showing posts from April, 2022

దీనదయాళ్ ఉపాధ్యాయ మానవతావాద తాత్విక చింతన

దీనదయాళ్ ఉపాధ్యాయ మానవతావాద తాత్విక చింతన           దీనదయాళ్ ఉపాధ్యాయ  సెప్టెంబర్ 25, 1916 రాజస్థాన్‌లోని ధంకియాలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తమ్మున్ని కోల్పోయారు.అతను పిలానీలోని GD బిర్లా కళాశాలలో , కాన్పూర్ విశ్వవిద్యాలయంలోని సనాతన్ ధర్మ కళాశాలలో చదివాడు.   సివిల్ సర్వీస్ పరీక్షలో ఉత్తీర్ణుడైనా ఉద్యోగం లో చేరకుండా ప్రజాసేవకే అంకితమయ్యాడు ఉపాధ్యాయ.           1937లో 26 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) లో చేరి జీవితకాల ప్రచారక్‌గా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించాడు.  స్వయంసేవక్ సంఘ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. ఆర్ఎస్ఎస్ కొలనులో పుట్టినదే జన సంఘ్.  అదిప్పుడు   భారతీయ జనతా పార్టీ గా మారింది. జనసంఘ్ ప్రారంభం నుండి 1967 వరకు దాని ప్రధాన కార్యదర్శి పనిచేశాడు. భారతీయ జనసంఘ్‌లో 51 ఏళ్ల వయసులో అధ్యక్షుడైనాడు.          ఆర్ ఎస్ ఎస్ రాజకీయ అంగమే  జనసంఘ్. ఆర్.ఎస్.ఎస్. తన హిందూత్వ సిద్దాంతాన్ని అమలు చేయడానికి ఒక రాజకీయ పార్టీ కావాలని నిర్ణయించి, దా...

పూలే తాత్విక దృక్పథం

Image
            మహాత్మా జ్యోతి బా పూలే   1827 ఏప్రిల్ 11 వ  మహారాష్ట్రలో జన్మించిన జోతిభాపూలే   మార్క్స్ మహనీయుని సమకాలికుడు. భారతీయ తాత్వికతకు నిజమైన వారసుడు. సమానత్వ సమాజం రావాలని ,మనువాదుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న విద్య , విజ్ఞానం మనుషులందరికి సమానంగా దక్కాలని తపించిన వాడు. సమాజానికి చదువు ప్రాధాన్యతను ప్రబోధించిన సామాజిక విప్లవ స్ఫూర్తి శిఖరం పూలే . మనువాద  చట్టాలను ప్రతిఘటించడమే గాక మెజార్జీ ప్రజలకు చదువెందుకు లేదో, ఇండ్లు భూములెందుకు లేవో,బట్టలెందుకు లేవో , కనీస ఆహారం కూడా ఎందుకు దొరకడం లేదో,సంపద సృష్టిస్తున్న వారికి అందులో చాటా ఎందుకు దక్కడం లేదో ప్రశ్నిస్తూ అసమానతలపై తిరుగుబాటు చేశాడు.  1848 ప్రపంచంలో పెను మార్పులు సంభవించాయి .  ప్రపంచ మానవాళి విముక్తి సిద్ధాంతం కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను కారల్ మార్క్స్ ప్రపంచానికి అందించిన సంవత్సరం అది.  అమెరికాలో స్త్రీల విముక్తి ఉద్యమం కూడా ముమ్మరంగా జరుగుతున్న రోజులవి . ఆ స్ఫూర్తితో పూలే మొట్టమొదటి బాలికల ఉన్నత పాఠశాలను నెలకొల్పారు .తన భార్య సావిత్రి బాయి పూలేకు త...