Posts

Showing posts from June, 2021

హిందూత్వమనేది భారతీయ విలువలకు వ్యతిరేకం

Image
హిందూత్వమనేది భారతీయ విలువలకు  వ్యతిరేకం  అసమానతలకు వ్యతిరేకంగా నిలబడిన బౌద్ధ మతాన్ని అస్పృశ్యకులాలు,    బహుజనులకు          చెందిన ప్రజలు ఎక్కువగా ఆదరించారు. పతంజలి (క్రీ. పూ. 150) తన ‘మహాభాష్యం’ లో  శ్రమణులు బ్రాహ్మణులు పాము ముంగిస లాగా శత్రువుల వంటివారని రాశాడు. బ్రాహ్మణమతం, బౌద్ధమతాల మధ్య ఈ చిరకాల విరోధం ఉన్నట్లు రెండు మత సాహిత్యాల్లోనూ విస్తారంగా ఉంది.  అంతకంటే ముఖ్యంగా.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో బౌద్ధ స్మారకాలను ధ్వంసం చేయటం లేదా సంలీనం చేసుకున్న పురావస్తు ఆధారాలు భారీ స్థాయిలో ఉండటం దీనిని నిర్ధారిస్తోంది.              నిజానికి, దేశంలో బౌద్ధమతం అంతర్థానమవటం వెనుక ప్రధాన కారణం, దానికి వ్యతిరేకంగా బ్రాహ్మణమతం దాడి చేయటమే. బ్రాహ్మణమతం ఎన్నడూ బౌద్ధమతంతో సయోధ్య కుదుర్చుకోలేదని ఇది స్పష్టం చేస్తోంది. కాబట్టి, హిందూమతం సహనశీల మతమనే ఆలోచనకు సరైన ప్రాతిపదిక లేదు.      భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేయడంలో బౌద్ధం ఆ తర్వాతఇస్లాం మతం నిర్వహించిన పాత్ర విశిష్టమైనది. ...

గోత్రం అంటే ఏమిటి?

గోత్రమ్ అనే పదం రెండు సంస్కృత పదాల నుండి ఏర్పడింది.  మొదటి పదం 'గౌ'- అంటే ఆవు, రెండవ పదం 'త్రాహి' అంటే కొట్టం. గోత్రం అంటే 'గోశాల' అని అర్ధం. అంటే ఆవులు నిలుపు స్థలం అని అర్థం. ఇది వంశ మూలపురుషుని పేరుని తెలియజేస్తుంది.  ఆటవిక జీవితమును గడపిన మానవుడు గోవులను వాటి రంగులను తొలుత ఆయా వ్యక్తుల తాతా, ముత్తాతలను గుర్తించడానికి నల్లావులవారు, కపిలగోవువారు, తెల్లావులవారు అని మూలపేర్లను కలిగి ఉండేవారు. గోత్రం అనే పదం వేదాలలో ఎక్కడా కానరాదు. అయితే, పాళీ భాషలోని కొన్ని శాసనాలలో మనకు ‘గొట్ట’ అనే మాట కనిపిస్తోంది. బౌద్ధమతం సుస్థిరం అయిన కాలం నాటికే గోత్రం అనేది మన సమాజంలో స్థానం సంపాదించుకుంది. జైనులలోకూడా ‘గోత్రం’ గురించిన ప్రసక్తి ఉంది. ‘గోత్రం’ అంటే అనేక అర్థాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో 1. వంశం, 2. గుంపు, సమూహం, 3. పేరు, 4. గొడుగు, 5. బాట అనేవి ఇక్కడ పేర్కొనవచ్చు.  ‘గోత్రం’ అనే పదం ‘గౌః’ అనే సంస్కృతపదం నుంచి ఆవిర్భవించింది. ‘గౌః’ అంటే గోవులుఅని అర్థం. ‘గోత్ర’ అనే సంస్కృత పదానికి 1. భూమి, 2 గోవుల సమూహం అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒకే గుంపులోని వారంతా రక్త సంబంధీకులే కాబట్టి...

ఆయుర్వేదం

✿✿ ఆయుర్వేదం - ఆర్య సనాతన మతం ✿✿       ఇప్పుడు బ్రాహ్మణ మతస్తులు ప్రగల్భాలు పలుకుతున్నట్లుగా, ఆయుర్వేదం వారి పూర్వకులు కనుగొన్న విజ్ఞానం కానే కాదు., ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయడంలో ఈ సనాతన మతస్తుల పాత్ర ఏమాత్రం లేకపోగా, అది సర్వనాశనం కావడానికి వీరు కారణం అయ్యారు..       ఆయుర్వేదం ప్రాచీన భారతీయ రోజువారీ వైద్య విధానంలో భాగమే.. ప్రాచీన రసశాస్త్రం (Alchemy) లో భాగంగా మొక్కల రసాయనిక గుణాలపై పదుల తరాలు చేసిన కృషి ఆయుర్వేదం అభివృధ్ధికి దారి తీసింది.. వందల సంవత్సరాలు వివిధ మొక్కలపై , మొక్కల రసాయన స్వభావాలను, జీవజాతి (మానవులతో కలిపి) మీద వాటి ప్రభావాలనూ గమనిస్తూ, వాటిని నమోదు చేస్తూ పరిశోధనలు జరిగి ఉంటే తప్ప ఇంత కట్టుదిట్టమైన శాస్త్రం తయారయ్యే అవకాశమే లేదు..         దీనికి ముఖ్యంగా ఆ పరిశోధన చేసే సమాజం స్థిర నివాసాలు కలిగినవారై ఉండాలి. వారి చుట్టుపక్కల వృక్ష జాతిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి., అంటే స్థిర నివాసాలు లేని అనాగరిక సంచార జాతులైన ఆర్యులు ఆయుర్వేదాన్ని కనుగొనే అవకాశమే లేదు., ఈ మధ్య కొంతమంది బ్రాహ్మణవాద చరిత్రకారులు ఆర్యులే సింధూ నా...