మకర సంక్రాంతి
సంక్రాంతి కాదు ఇది పొంగల్ ఉత్సవం భారత దేశ ప్రజలు ముఖ్యoగా శ్రమ జీవులైన సాధారణజనాల పండగలు పూర్తిగాబ్రహ్మణీకరించబడ్డాయి. హరప్పా నాగరికత తో విలసిల్లిన భారత ఉపఖండాన్ని ప్రాచీన బ్రాహ్మణీయ వ్యవస్థ వేదకాలం నుండి పూర్తిగా వారి ఆధీనoలోకి తీసుకువెళ్లడం లో విజయం సాధించింది. వేదకాలం తరువాత బుద్ధుని కాలం లో బ్రాహ్మనీయ విధానం పూర్తిగా తప్పుడు సిద్ధాంతం అని తథాగతుని బోధనల వలన ఈ దేశ ఉపఖండ ప్రజలు తెలుసుకున్నారు. బుద్ధుని బోధనలు క్రీ.పూ. 5 వ శతాబ్దం నుండి మొదలయ్యాయి. దీనిని పూర్తిగా ప్రజల్లోకి తీసుకుపోయింది సామ్రాట్ అశోకుడు .సుమారు 5 శతాబ్దం నుండి క్రీస్తు శకం 15 శతాబ్దం వరకు బౌద్ధం ఈ దేశం లో విలసిల్లింది. భారతదేశ చరిత్ర మొత్తం "బౌద్ధానికి బ్రాహ్మనిజానికి మధ్య జరిగిన సంఘర్షనే" అని డాక్టర్ అంబేడ్కర్ విశదీకరించారు.సుమారు రెండువేల ఏళ్ల బౌద్ధకాలం లో అనునిత్యం బౌద్ధం బ్రాహ్మనిజంతో సంఘరిస్తూనే ఉంది.భారత దేశం లో అనాదిగా కష్టజీవులు ,ఇష్టం గా శ్రమ జేసే శ్రామికులు.శ్రమ చేస్తున్న శ్రామిక ప్రజానీకం ఉత్సాహాలను వేడుకలను బ్రాహ్మణీకరించింది బ్రాహ్మణ పూజారి వర్గం. శ్రామ...