Posts

Showing posts from February, 2021

బ్రాహ్మణాలు

నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ  యజ్ఞాలకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలో వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అంటారు. బ్రాహ్మణాలలో సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని  అనేక వివరణలతో , ఉపాఖ్యానాలు కూడా ఉంటాయి.

క్రైస్తవమత తాత్విక చింతనా ధోరణులు

Image
_క్రైస్తవమత  తాత్విక చింతనా ధోరణులు_       pc teluguoneindia.com    ‌‌ప్రపంచచరిత్ర రాసిన  క్రిస్  బ్రేజియర్ ప్రకారం  అగస్టస్ సీజర్(క్రీ.పూ. 27 నుండి క్రీ. శ 14)   రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో  అతని అధీనంలో ఉన్న జుడియా రాష్ట్రంలో  జీసస్ జన్మించాడు. అతని గురించి బాల్యాన్ని గురించి మనకు తెలియదు. అతను 30 సంవత్సరాల వయస్సు వచ్చేటప్పటికి అతడు మత ప్రవక్త గా అందరి దృష్టిని ఆకర్షించాడు. అతనికి కూడా అనుయాయులు తయారయ్యారు. దేవుడు ఒక్కడే అని బోధించడం ప్రారంభించాడు. తాను ఆ దేవుని దూత అని చెప్పుకున్నాడు. జీసస్  యువతీ యువకులకు అనేక  బోధనలు తన మాతృ భాష హిబ్రూలో  చేప్పేవాడు. కాకపోతే ఆయన చెప్పిన దేవుడు మాత్రం అన్ని జాతులకు చెందిన దేవుడు.           'ఇసయా' అనే ప్రవక్త హిబ్రూల కోసం అప్పటికే ఒక ఎడారి దేవున్ని పేదలను కాపాడతాడని ప్రచారం   చేశాడు. ఆ దేవుడు అన్యాయాలను అక్రమాలను ప్రతిఘటిిిిిస్తూ   పేదలను ఆదుకుంటాడని జనం నమ్ముతున్నారు.ఆ నమ్మకాన్ని ఉపయోగించుకుని...

ఇండో-గ్రీకు ప్రభావం

ఇండో-గ్రీకు ప్రభావం క్రీ.పూ. 500 కాలంలో పర్షియా చక్రవర్తి దారియస్ పశ్చిమ ఆసియా, ఇరాన్, ఆప్షనిస్తాన్, తుర్క్ మెన్ స్తాన్ తజిక్ స్తాన్, ఉత్తర సింధు ప్రాంతాలకు తన రాజ్యాన్ని విస్తరించాడు. ఆనాడు అయోనియాగా పిలువబడే పశ్చిమ ఆసియాలోని సిరియా, జోర్డాన్, యూరప్ లోని ఆల్బేనియా ప్రాంతాలు దారియస్ అధీనంలోకి వచ్చాయి. తన రాజ్యంలోని గ్రీకు సైన్యాలను ఆఫ్ఘనిస్తాన్, తుర్క్ మెన్ స్తాన్, తజిక్ స్తాన్ లలో దారియస్ మొహరించాడు. ఆవిధంగా దక్షిణ ఆసియాలో గ్రీకుల ప్రభావం ప్రారంభమయింది. పర్షియన్ సామ్రాజ్య పతనం తరువాత, అలెక్జాండర్ క్రీ.పూ 326 లో దక్షిణ ఆసియాలో సింధునదీప్రాతాల వరకూను, ఉత్తరాన ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలోని కొన్ని ఫ్రాంతాలను జయించటంతో, అతని తరువాత అతని సైనికాధికారులు గ్రీకు రాజ్యాలను ఏర్పరిచారు. ఆవిధంగా గ్రీకు రాజ్యాలు క్రీ.శ. 10 వరకూ కొనసాగాయి. అయితే, ఏదో ఒక రూపంలో భారతదేశంలో గ్రీకులప్రభావం క్రీ.శ. 750 వరకూ కొనసాగింది దాదాపు వెయ్యి ఏళ్ళ పాటు కొనసాగిన గ్రీకుల ప్రభావం భారత రాజకీయాలపైనా, సంస్కృతిపైనా, కళలపైనా ఉన్నది. భారత దేశ పశ్చిమోత్తర భాగాలకు పరిమితం కాకుండా, గ్రీకుల ప్రభావం తూర్పున మధుర, పాటలీ పుత్ర వరకూ...

పర్వ “ను నడిపిన ముగ్గురు మహోన్నత స్ర్రీమూర్తులు

Image
                భారతీయ సవలా రచయితలలో ప్రముఖులైన డా. ఎస్.ఎల్. భైరప్ప గారు కన్నడ భాషలో రచించిన గొప్ప నవల “పర్వ”. ప్రాచీన వ్యాస భారతానికి ఇదొక ఆధునిక నవలారూపం. అయితే భారతం లోని మాయలు, మంత్రాలు వంటివి నిజంగా సంభవమా అనే హేతువాద ధృక్పధంతో ఎంతో పరిశోధన జరిపి భైరప్పగారు ఈ నవలను రచించారు. ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు సామాన్య పాఠకులకు కూడ అర్థమయ్యేలా తేటతెలుగు పదాలతో, చక్కని వాక్యనిర్మాణంతో తెలుగులోకి “పర్వ” నవలను అనువదించారు. ప్రఖ్యాత కన్నడ నవలా సామ్రాట్టు డా. ఎస్.ఎల్. భైరప్ప గారి అత్యంత ప్రసిద్ధి చెందిన నవల “పర్వ” ప్రచురణై 40 ఏళ్ళు గడిచాయి. గత సంవత్సరం డిసెంబరులో బెంగుళూరులో భైరప్ప గారి రచనలపై జరిగిన సాహిత్య సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్రసాహిత్య అకాడమి అద్యక్షులు శ్రీ చంద్రశేఖర కంబార మాట్లాడుతూ “ భైరప్పగారు వ్యాస భారతం లాంటి మహా కావ్య కృతిని పర్వ నవలగా రాసి ఎన్నో శతాబ్దాల మన సంప్రదాయాన్నిరక్షించారు. దాని ద్వారా మనలను ఒక గొప్ప సాంప్రదాయానికి వారసులుగా చేసార”న్నారు. ఉపాద్యక్షులు డా. మాథవ్ కౌశిక్ మాట్లాడుతూ “భైరప్ప వ్యాస భారతాన...