సత్యశోధక్ సమాజ్ తాత్వికత
జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజ్ తాత్వికత బ్రిటిష్ వారి రాకతో అప్పటి భూస్వామిక వ్యవస్థ కదలడం ప్రారంబించింది. 1819 నాటికే మహారాష్ట్ర లో పీష్వా ల పాలన అంతమై బ్రిటీష్ వారి చేతుల్లోకి పోయింది.వారు ప్రవేశ పెట్టిన సాంకేతిక పరిజ్ఞానం కారణంగా భారతీయ సమాజం,సంస్కృతి పెనుమార్పులకు లోనయ్యింది. శూద్రులకు చదువు అందుబాటులోకి వచ్చింది. వివిధ దేశాల్లో ‘ప్రాపంచిక జ్ఞానం’, ‘తాత్విక చింతన’ సాహిత్యం ద్వారా ప్రజల్లోకి వెళ్లింది. కానీ మనదేశంలో మాత్రం తాత్విక చింతన విశ్రాంత వర్గం దగ్గరే ఉండి పోయింది. ఆంగ్లేయులు రాకతో విద్య సామాజిక పరమైనది. అప్పుడు బహుజనుల్లో విప్లవాత్మక భావాలు, సామాజిక తిరుగుబాట్లు మొదలయ్యాయి. తోటమాలి కులానికి చెందిన శూద్రుడు, (ఇప్పుడు ఓబిసి ) మహారాష్ట్రలోని సతారాలో జన్మించిన జ్యోతిరావు పూలే (11-04-1827 to 28-11-1890) సత్యశోధక్ సమాజ్ ను 1873 లో ప...