కార్తికేయమతం
కార్తికేయుని తమిళనాడులో ‘మురుగా’ అనీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ‘సుబ్రహ్మణ్య’ అనీ, ఉత్తరభారత దేశంలో ‘స్కంద’ అనీ అంటారు. ఆర్గురిని ఒకే శరీరంలో కూర్చి అవతరింపజేసిన కార్తికేయ సృష్టి ఒక గొప్ప ప్రయోగమని చెప్తారు సద్గురు. కార్తికేయునికి, అగస్త్యునికి మధ్య జరిగిన సంభాషణల సారమే మహాపురాణాలలో ఒకటైన స్కాంద పురాణం. కార్తికేయుని కొన్నిసార్లు యుద్ధానికి అధిపతిగా ఎందుకు ఆరాధిస్తారో కూడా సద్గురు వివరిస్తారు. శివుని కుమారుడు కార్తికేయుని జననంలో ఒక అద్భుత ప్రయోగం ఉంది. ఆరుగురు వ్యక్తుల్ని ఒకటి చేసి ఒక శరీరంలో ఇమడ్చటం జరిగింది. ఇటువంటి ప్రయోగాలు పూర్వం చాలా జరిగాయి. పూర్వం ఇద్దరు యోగులు ఒకే శరీరం పంచుకున్నారు. ఒకే శరీరంలో ఇద్దరు వ్యక్తులున్నారన్నమాట. వాళ్లు రెండు భిన్నమైన భాషలు మాట్లాడతారు, భిన్నంగా ఉంటారు. కాని ఇక్కడ ఆరు ప్రాణులు ఒకే శరీరంలో. ఇది ఎలా జరిగిందో తెలుసుకుందాం. శివుణ్ణి గొప్ప వీర్యశాలిగా వర్ణించినప్పటికీ, ఆయనకెన్నడూ సంతానం లేదు. ఏ మానవ స్త్రీ కూడా శివుని బీజాన్ని తన గర్భంలో నిలుపుకోలేదని అంటారు. అందువల్ల ఆయన తన వీర్యాన్ని హోమాగ్నిలో విడిచిపెట్టాడు. హోమాగ్ని అంటే అది నిజంగా అగ్ని కావలసిన అవసర...