పరస్పర విరుద్ధాంశాలను సమన్వయించే సంస్కృత రచన గీత
హైందవ సంప్రదాయంలో 'భగవద్గీత'కు ప్రత్యేక స్థానముంది. క్రైస్తవానికి బైబిలు', ముస్లింలకు 'ఖురాను', హిందువులకు 'భగవద్గీత' అలాంటిది పండితుని నుండి పామరుని వరకు గీతను జీవన వేదంగాను, కర్మయోగంగాను భావించి. మనిషి ఆధ్యాత్మక జీవితానికి కావలసిన అన్ని అంశాలు 'గీత'లోనే ఉన్నాయనే భ్రమను కల్పించారు. అందుకే భగవద్గీతా పదనమంటేనే బొందితో కైలాసం చేరినట్లు భావిస్తారు. సాధారణ అస్థికులు, వ్యాసుని ప్రోక్తమైన 'భగవద్గీతలో ధ్యానమార్గాలు, ఆత్మ-పరమాత్మల ప్రస్తావన అధికం. వైష్ణవమత తత్వమంతా నిండి ఉంది. అందుకే శ్రీ కృష్ణుడే... "ధర్మయుక్తమైన, సంవాదరూపకమైన, గీతా శాస్త్రాన్ని పఠించేవారు. జ్ఞానయజ్ఞం ద్వారా నన్ను పూజించిన వారవుతారు". 'ఏ సరుడైనా అసూయలేక శ్రద్ధతో గీతను వింటాడో, అతడు పాప విముక్తుడై పుణ్యలోకాలు పొందుతాడు". "దీనిని పరిస్తేచాలు నీవిక ఏమీ చేసే అవసరం లేకుండానే నన్ను పూజించినంత పుణ్యం కలుగుతుంది. అట్టివారికి పునర్జన్మలులేని పుణ్యలోకాలు, ప్రాప్తిస్తాయి" అంటాడు భగవద్గీతలో, గీతలోని 18 అధ్యాయాలు కాని, లేదా సగంకాని, 6 అధ్యాయాలుకాని, ఒక అధ్యాయ...