Posts

Showing posts from September, 2021

నిత్య చైతన్య ప్రవాహం భగత్ సింగ్

Image
    pc. Facebook  నిత్య చైతన్య ఝరీ ప్రవాహం భగత్ సింగ్ తాత్విక ఆలోచనలు "జీవితాన్ని ప్రేమిస్తాం,మరణాన్నీ ప్రేమిస్తాం. మేం మరణించి ఎర్రపూల వనంలో పూలై పూస్తాం. ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం.  నిప్పురవ్వల మీద నిదురిస్తాం.”అన్న భగత్‌సింగ్‌ 1907 సెప్టెంబర్‌ 27వ తేదీన నేటి పాకిస్థాన్‌లో గల ల్యాల్‌పూర్‌ జిల్లా లోని బంగాలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు జన్మించాడు. 1931, మార్చి 23వ తేదీన లాహౌర్‌ జైలులో బ్రిటిష్ వారి ఉరికొయ్యలపై   ఈ విప్లవకిశోర కంఠారావం ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ మూగబోయింది. అదిప్పుడు భారతదేశ యువతరాన్ని తట్టి లేపుతోంది. అప్పటికి భగత్ సింగ్ వయసు 23 ఏళ్లు మాత్రమే.       జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల వయస్సు లోనే సామ్రాజ్యవాద వ్యతిరేక యోధునిగా పరిణమించేలా చేసింది. భగత్‌సింగ్‌ కు గాంధీ  నాయకత్వంలో సాగుతున్న జాతీయోద్యమం పట్ల  భ్రమలు తొలిగిపోయాయి. 1924వ సంవత్సరంలో ఆయన సచీంద్రనాద్‌ సన్యాల్‌, రాంప్రసాద్‌ బిస్మిల్‌ వంటి  విప్లవకారులతో స్థాపించబడిన హిందుస్థాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ అసోషియేషన్లో చేరాడు....

గాంధీజీ

      గాంధీ భావాలు పై రామకృష్ణ పరమహంస, వివేకానంద ల బోధనల ప్రభావం ఉంది.  పరమతసహనాన్ని ఇదే ఆయనకు నేర్పింది. ఆయన భగవద్గీత చదివి అహింస ప్రాధాన్యత ను అర్థం చేసుకున్నారు. అయితే ఇవన్నీ ఆచరణాత్మకంగా చేసి చూపించారు. భారతీయ తాత్వికతను కొత్త దారిలోకి మళ్లించారు.         గాంధీ  మత మౌఢ్యం నుండి  ప్రజలను మరల్చి వారిని పోరాటయోధులుగా, కార్యశూరులుగా చేశారు. మూఢ భక్తిని, కుల, మత ఛాందసభావాలను ఎదుర్కొన్నారు. హిందూ ముస్లిమ్ విభేదాలను ఎదుర్కొని ప్రజలందరిని సమైక్యంచేసి స్వాతంత్ర్యోద్యమంలోకి నడిపించారు. అస్పృశ్యత భారతదేశానికి ఒక శాపం ఒక కళంకం అని ఎలుగెత్తి చాటారు. హిందూ ముస్లిం ఐక్యత కోసం చివరి వరకు పోరాడారు. ఆ పోరాటంలోనే చివరకు ఆర్.ఎస్.ఎస్. మతోన్మాది పిస్తోలు గుండుకు ఆహుతి అయి మరణించారు. ప్రజం ఆకలిని తీర్చి దారిద్రాన్ని తొలగించి, వారిని ఆత్మ గౌరవం తో  జీవించేటట్లు చేయగల్గినవాడే గాంధీజీ దృష్టిలో నిజమైన దేవుడు, ఆ విధంగా చేసేదే నిజమైన మతం.  దేవుణ్ణి, మతాన్ని ప్రజల జీవిత సమస్యలతో వూహించినవాస్తవికవాది,తాత్విక వేత్త గాంధీజీ. ముక్తి, మోక్షం పేరుతో ముక్కు మూ...

యం.యన్.రాయ్. మానవ వాద తాత్విక దృక్పథం

Image
   యం.యన్.రాయ్.  ఒగోనెక్  మ్యాగజైన్ (మాస్కో), 5 ఏప్రిల్ 1925  యం.యన్.రాయ్. మానవవాద తాత్విక దృక్పథం                    'స్వేచ్ఛాపోరాటాలు మనిషికి సహజంగా ఉంటాయి. మానజాతి చరిత్రంతా స్వేచ్ఛా పోరాటాల చరిత్రే' అని చెప్పిన యం.యన్.రాయ్    అసలు   పేరు నరేంద్రనాధ్ భట్టాచార్య. పెద్దయ్యాక  మానవేంద్ర నాథ రాయ్ గా పేరు మార్చుకున్నాడు .ఆయన మార్చి, 21, 1887 న  బెంగాల్‌లో  జన్మించారు ‌‌.హేతువాది, మానవవాది. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ  వ్యవస్థాపకుడు, రాజకీయవేత్త, బహుభాషా ప్రావీణ్యం గల  యం.యన్.రాయ్  జనవరి 25, 1954 లో కన్నుమూశారు.           అతను భారతీయ సంస్కృతి పాశ్చాత్య సంస్కృతి కంటే గొప్పదని భావించాడు.  భారతదేశంలోని బ్రిటిష్ పాలన పోవాలంటే సాయుధ పోరాటం సరైనదనుకున్నాడు.  పరిశీలకులు రాయ్  రాజకీయ ప్రస్థానంలో మూడు దశలను గుర్తించారు. అతను మొదట జాతీయ వాది. తర్వాత  కమ్యూనిస్ట్ గా మారాడు,ఆ తర్వాత చురుకైన రాడికల్ హ్యూమనిస్ట్‌గా మా...

రావిపూడి వెంకటాద్రి

             ఆంధ్రదేశంలో హేతువాదిగా, మానవవాదిగా లబ్ధప్రతిష్ఠులైన శ్రీ రావిపూడి వెంకటాద్రి గారు 2021 ఫిబ్రవరి 9 వ తేదీన 99 సంవత్సరాలు నిండి 100 వ ఏట ప్రవేశించారు. ఆయన 1922 వ సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన అప్పటి గుంటూరు జిల్లా (నేటి ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ) నాగండ్ల గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. స్ఫురద్రూపిగా, ఆజానుబాహుడైన యువకునిగా ఆయన మొదట్లో నాటకరంగం వైపు ఆకర్షితులై శ్రీకృష్ణ పాత్రధారణకు పేరొందారు. అయితే క్రమంగా 'కవిరాజు' త్రిపురనేని భావజాలం ప్రభావంతో ఆయన హేతువాదం వైపు మొగ్గి, తాను స్థాపించిన 'కవిరాజాశ్రమం' ద్వారా హేతువాద భావాల వ్యాప్తికి అనంతరకాలంలో అహర్నిశలూ కృషిచేశారు. 1945లో యం. యన్. రాయ్ భావాలతో ప్రభావితులై, రాడికల్ డెమోక్రటిక్ పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి ఆయన వ్యవస్థాపక అధ్యక్షులు. భారత హేతువాద సంఘానికి, ఆంధ్రప్రదేశ్ రాడికల్ హ్యూమనిస్టు సంఘానికీ ఆయన చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆంధ్రదేశంలో శాస్త్రీయ, తాత్త్విక విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, విస్తృతంగా ప్రచారం చేసిన అతి కొద్దిమందిలో శ్రీ వెంకటాద్రి గారొ...

ఈశ్వర చంద్ర విద్యాసాగర్

దార్శనికుడు విద్యావేత్త, తత్త్వవేత్త,రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు అయిన ఈశ్వర చంద్ర విద్యా సాగర్ బెంగాలీ లిపిని 1780 తరువాత మొదటి సారి క్రమబద్ధీకరించాడు. ఈశ్వర్ చంద్ర బిర్సింగా గ్రామము (ప్రస్తుత పశ్చిమ బెంగాల్) లో ఒక పేద కుటుంబములో జన్మించాడు. బాల్యమంతా పేదరికముతో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించాడు. తండ్రి సంస్కృత ఉపాధ్యాయుడు కావడము చేత కొడుకు కూడా ఆదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828 లో ఉద్యోగము దొరకడముతో కలకత్తాకు మారాడు. ఆయన సమీప బంధువు మధుసూదన్ వాచస్పతి, ఈశ్వర్ ను సంస్కృత కళాశాలకు పంపమని కోరగా అక్కడికి పంపారు. 1839 లో హిందూ న్యాయశాస్త్రములో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ బిరుదును పొందాడు. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియమ్ కాలేజిలో ప్రధాన సంస్కృత పండిత్ పదవిని పొందాడు. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టాడు. ఈశ్వర్ చంద్రకు భయము లేకపోవడము వల్ల కాలేజీ యాజమాన్యమునకు ఇబ్బంది పెరిగింది. 1849 లో కాలేజీ నుండి రాజీనామా చేసి, ...

సామాజిక తత్త్వవేత్త శ్రీ నారాయణ గురు.

      భారతదేశపు చీకటి రాజ్యం లో   సామాన్యుల కుత్తుకల మీద విలయతాండవం చేసిన సామాజిక వ్యవస్థ కులం.  హిందూమతం లో అశాస్త్రీయ భావాలతో సాగిన సతీ సహగమనం, బాల్య వివాహం, కులవ్యవస్థ, మూర్ఖత్వంగా సాగుతున్న  మూఢ విశ్వాసాలను   చాలా మంది తాత్విక వేత్తలు ప్రతిఘటించారు.“స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వం, సమానత్వం” వంటి విప్లవాత్మక ఆధునిక భావాలపట్ల ఆకర్షితులై భారత దేశం లో ని సమస్యలన్నిటినీ రూపుమాపడానికి నిస్వార్థం గా అమూల్యమైన సేవ కూడా చేసారు వీరు. ఇలాంటి  నిశ్శబ్ద భారతీయ సామాజిక తాత్విక వేత్త లలో శ్రీ నారాయణ గురు ఒకరు.  నారాయణగురు క్రీ.శ. 1854 ఆగస్టు 20న కేరళలో తిరువనంతపురానికి కూతవేటు దూరంలో 'చెంపాజండీ' గ్రామంలో ఈళవ అనే హరిజన కులంలో మదన్ ఆశాన్, కుట్టి అమ్మ దంపతులకు జన్మించాడు. అందరూ ఆయనను 'నానూ' అని పిలిచేవారు. చట్టాంబీ స్వామి అనబడే కుంజన్ పిల్లె వద్ద సంస్కృత అధ్యయనం చేశాడు. తిక్కాడ్ అయ్యబూ వద్ద యోగశాస్త్రాన్ని అభ్యసించాడు. నారాయణగురు అరవీపురం అడవుల్లో ధ్యానంలో ఉండి చాలాకాలం తపస్సు చేశాడు. ఇతరులకు మేలు చేయడంలోనే నిజమైన ఆనందం ఉందనే జీవన రహస్యాన్ని తెల...

ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (Eswara chandra vidyaasaagar)

Image
  పందొమ్మిదో శతాబ్ది భారతీయ పునరుజ్జీవనోద్యమ  మూల పురుషులలో ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఒకరు.  స్త్రీ, పురుష సమానత్వమనే సమున్నత ప్రజాస్వామిక విలువే పునాదిగా ఆయన సంస్కరణోద్యమాన్ని నిర్మించారు. సైన్స్‌, హిస్టరీ, తర్కం పునాదులపై మానవతావాదాన్ని అభివృద్ధి పరిచేందుకు పరితపించిన నవ భావయోధుడు విద్యాసాగర్‌. ఆయన ఆలోచనలు, కార్యాచరణ వెనక వున్న తాత్విక భావశక్తిని వర్తమాన భారతీయ సమాజం  ఆవాహన చేసుకోవలసిన అవసరం ఎంతైనా వున్నది.  గత తరాల మహనీయుల అడుగు జాడల్లో నడిచినప్పుడే మనం మరింత ముందుకు పురోగమించగలం. రెండు శతాబ్దాల క్రితం భారతీయ సమాజాన్ని అంధకారం నుంచి వెలుగు బాటకు మళ్లించిన ఒక మహోన్నత మానవతామూర్తిని మనం తప్పక స్మరించుకోవల్సిన సమయమాసన్నమయింది. ప్రజాస్వామిక, లౌకిక విలువలను అణువణువునా నింపుకొన్న ఆ మహా పురుషుడు తన కాలపు మూఢనమ్మకాలపై సాగించిన పోరు అనన్యసామాన్యం. అందుకు ఆయన అనుసరించిన మార్గం, ఆచరించిన పద్ధతి తరతరాలకు స్ఫూర్తి దాయకమైనది. ఆ మహావ్యక్తి సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ వైతాళికుడిగా సుప్రసిద్ధుడైన ఈశ్వర చంద్ర బందోపాధ్యాయ. ఈశ్వర చంద్ర విద్యాసాగర్‌గా లోకవిఖ్యాతుడైన ఈ జ్ఞానమూర్తి 1...

గురుదేవ్ రవీంద్రనాథ్‌ ఠాగోర్‌ అంతర్జాతీయ దృక్పథం

బెంగాలు లో  1861 మే 7 వ తేదీన దేవేంద్రనాథ ఠాగూర్, శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించాడు. ఇతని బాల్యం చాలా చోద్యంగా గడిచింది. ఆముదం దీపం ముందు పుస్తకం పట్టుకొని కూర్చొని ఆవలిస్తూ కునికిపాట్లు పడుతూ చదివేవాడు. నిద్ర లేవగానే ఇంటి తోటలోకి పోయి ప్రకృతి సౌందర్యాన్ని చూచి ఆనందించేవాడు. కథలంటే చెవి కోసుకొనేవాడు. సామాన్య దుస్తులతో, నిరాడంబరంగా పెరిగాడు. బాల్యంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఉండవలసి రావటంతో ఆయనకు బయటి ప్రపంచం అద్భుతంగా తోచేది. ప్రపంచమొక రహస్యమనీ, ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనీ కుతూహలపడేవాడు. * శాంతినికేతన్* రవీంద్రుడు కేవలం రచయితగానే ఉండిపోక, బాలల హృదయాలను వికసింపచేయటానికై ప్రాచీన మునుల గురుకులాల తరహాలోనే శాంతినికేతన్‌గా ప్రసిద్ధి గాంచిన విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. అది అయిదుగురు విద్యార్థులతో మొదలై, క్రమంగా విస్తరించింది. చిన్న పిల్లలు ఉపాధ్యాయుల ఇళ్ళల్లో భోజనం చేసేవారు. ప్రాతఃకాలానే నిద్ర లేవడం, కాలకృత్యాలు తీర్చుకొని, తమ గదులను తామే శుభ్రపరచుకొని స్నానం చేయడం, ప్రార్థన చేయటం, నియమిత వేళలలో నిద్ర పోవటం వారి దినచర్య. ఆరోగ్యం కాపాడుకోవటం, పరిశు...

మనసే అన్నింటికీ మూలమన్న శారద దేవి

శారదా మాత తరచూ, మనసు చేసే మాయ గురించి మాట్లాడేవారు. ‘మనసే అన్నింటికీ మూలం. దర్శించే ప్రతి విషయాన్నీ ఇది మంచి, ఇది చెడు అంటూ బేరీజు వేసేది మనసే. అందుకని ఎదుటివారిలో తప్పులనే వెతకాలనుకుంటే ముందు నీ మనసే దోషపూరితం అయిపోతుంది,’ అని ఒక సందర్భంలో అంటారు. అంతేకాదు శారదామాత చివరి సందేశం కూడా ఇంచుమించు ఇలాగే సాగింది- ‘మీకు మనశ్శాంతి కావాలంటే, ఇతరులలో లోపాలను వెతకడం మానండి. అందుకు బదులుగా మీ లోపాలేమిటో గ్రహించండి. ఈ ప్రపంచమే మీది అన్నంతగా దానిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఈ ప్రపంచమే మీది అనుకున్నప్పుడు... అంతా మనవారే అన్న భావన కలుగుతుంది.’ ఏమైనా అమ్మ అమ్మే! అందుకే ప్రపంచంలోని వారంతా తన బిడ్డలేననీ, వాళ్లంతా ఒకరిలో ఒకరు తప్పులు వెతుక్కుంటూ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఉండాలనీ కోరుకుంది. అందుకే శారదాదేవి కాస్తా శారదామాతగా భక్తుల గుండెల్లో నిలిచిపోయింది. రామకృష్ణులు ఆమెను కాళికకు ప్రతిరూపంగా భావించడంలో ఆశ్చర్యం ఏముంది! తనలోని మాతృభావనను ఈ ప్రపంచం మొత్తానికీ విస్తరించాలనుకునే ప్రతి తల్లీ కాళికామాతే కదా!

మతసామరస్యమే రామకృష్ణ పరమహంస తాత్విక చింతన

Image
             Ramakrishna Paramahamsa మతసామరస్యమే రామకృష్ణ పరమహంస  తాత్విక చింతన         రామకృష్ణ పరమహంస అన్ని మతాల పట్ల సమధర్మం పాటిస్తూ, ప్రాపంచిక జీవితం పట్ల నిర్లిప్తత , ఉదాసీనతతో జీవించి సరికొత్త అద్వైతవాదాన్ని ప్రవేశ పెట్టాడు.ఇతను భావవాది అయినప్పటికీ  ప్రపంచంలోని వివిధ మతాల మధ్య  ఐక్యతను  సాధించడానికి ప్రయత్నించారు. అదే పరిస్థితి నేడు జరిగి ఉంటే మత చాందసులు అతన్ని చంపేసేవారు.అన్ని మతాలలో ఉన్న సత్యం మరియు ధర్మం ఒకటేనన్నాడు. ఇది బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదిగా నిలిచింది. అది వివేకానందుని ద్వారా దేశ వ్యాపితమైంది.        రామకృష్ణ పరమహంస  మానవ సమానత్వం   కోసం నిలబడ్డారు మరియు కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు.         మైఖేల్ మధుసూదన్ దత్తా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ్ చంద్ర సేన్ మొదలైన వారు రామకృష్ణ తాత్వికతకు ప్రభావితులయ్యారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస కు గొప్ప శిష్యుడయ్యాడు. భారతదేశం, యూరప్ ...

గీతలోని అసంబద్దత

ఆత్మ నిత్య సత్యమైనది మరియు చావు లేనిది. మృత్యువు వారిని శరీరాల నుండి వేరుచేస్తుందే కానీ ఆత్మను చంపదు. సత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి తెలుసుకోవడమే. అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి, వస్తు ప్రపంచాన్ని వదలి సర్వోత్కృష్టమైన పరబ్రహ్మాన్ని చేరగలడు. భక్తి, కర్మ, ధ్యాన మరియు జ్ఞాన మార్గాలలో భగవంతుని చేరవచ్చును. మనిషి కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. అయితే కర్మలవలన దోషాలు కూడా తప్పవు. సత్పురుషుల ద్వారా జ్ఞానాన్ని సంపాదించి, సత్కర్మలు ఆచరించాలి. కర్మలపై ప్రతిఫలాన్ని ఆశించరాదు. అన్ని కర్మల ఫలాన్ని భగవంతునకు ధారపోయాలి. కృష్ణుడే పరబ్రహ్మము. సృష్టిలోని సకలము భగవంతుని అంశతోనే ఉన్నవి. అన్ని పూజల, యజ్ఞాల ఫలాలు ఆ దేవదేవునకే చెందుతాయి.  ప్రకృతిలో సకల జీవాలు సత్వరజస్తమోగుణాలచే నిండి ఉన్నాయి. భగవంతునకు శరణాగతుడైనవాడికి ఈ గుణాల బంధంనుండి విముక్తి లభిస్తుంది. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలున్నాయి. ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క "యోగము" అని చెబుతారు. వీటిలో 1నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి "కర్మషట్కము" అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను ...

బౌద్ధ తత్వం

థేరవాద బౌద్ధంలో - జన్మ జన్మల వేదన, సాధన అనంతరం సత్యాన్ని తెలిసికొని అజ్ఞానాంధకారంనుండి బయటపడి, ఇతరులకు ఆ మార్గాన్ని ఉపదేశించినవారు "బుద్ధులు" అవుతారు. సత్యాన్ని తెలిసికొన్నాగాని ఇతరులకు ఉపదేశం చేయనివారు "ప్రత్యేక బుద్ధులు" అవుతారు. శాక్యముని గౌతమ బుద్ధుడు ఒక్కడే బుద్ధుడు కాదు. అంతకు పూర్వము, ఇంకా ముందు కాలంలోను ఎందరో బుద్ధులు ఉంటారు. సత్యాన్ని తెలుసుకొన్న గౌతమబుద్ధుడు అనేక బుద్ధులలో ఒకడు. బుద్ధుని బోధనలలో "నాలుగు ఆర్య సత్యాలు" ప్రముఖ పాత్ర కలిగి ఉన్నాయి. దుఃఖం లక్షణం, దానికి కారణం, దుఃఖ నివారణ, నివారణా మార్గం - ఇవి ఆ నాలుగు ఆర్య సత్యాలు అలా దుఃఖాన్ని నివారించే మార్గం "అష్టాంగ మార్గం". బుద్ధుని అనంతరం బౌద్దాన్ని ఆచరించేవారిలో అనేక విభాగాలు ఏర్పడినాయి. వారి ఆచరణలోను, సిద్ధాంతాలలోను, సంస్కృతిలోను నెలకొన్న వైవిధ్యం కారణంగా బౌద్ధం అంటే ఇది అని స్పష్టంగా అందరికీ వర్తించే విషయాలు క్రోడీకరించడం కష్టమవుతున్నది. బోధి:-- బోధి అనగా "నిద్ర లేచుట" - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను "బోధి" అంటారు. జన్మ జన్మల సాధన,...