Posts

Showing posts from August, 2020

సమాజంలో అసమానతలు

                ఆదిమ సమాజంలో  మానవుడు ప్రకృతి విపత్తులు  ఎదుర్కొంటూ జీవించేవాడు. క్షణం క్షణం క్రూరమృగాల తో పోరాడుతూ అడవుల్లోని గుహల్లో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఉండేది. ఈ సంఘర్షణలో మనిషి చాలా దృఢకాయుడుగా ఉండేవాడు.   ఆరోగ్యంగా ఉండేవాడు. అనారోగ్యం బారిన పడేవాడు కాదు .మనిషి ఎప్పుడూ ప్రమాదానికి చేరువగా జీవించేవాడు. అంతే.  తనను తాను కాపాడుకోవడమే ముఖ్యంగా ఉండేది. అతని ఆలోచనలన్నీ ఆహార సేకరణ, తన్ను సంరక్షించుకోవడం,ఈ రెండింటి మీద ఉండేది.ఆ క్రమంలో అవి అతని పంచేంద్రియాల పై ప్రభావాన్ని కలిగించాయి. జంతువులు మాత్రం ప్రకృతికి లోబడి ఉండేవి. మనిషి మాత్రమే  ప్రకృతి కి ఎదురుతిరుగుతూ ఉండేవాడు. ఆ క్రమంలో మానవుల్లో అవగాహన శక్తి మెల్లగా పెరిగింది. అతని అనుభూతులు ఆవేశాలు దీనికి అవకాశం కలిగించాయి. ఆది మానవుడికి భౌతిక అవసరాలు మాత్రమే అవసరమయ్యేవి. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం కావాలి. ఆకలి తీరాక లైంగిక సుఖం కావాలి. ఈ రెండే. అతను మృత్యువు గురించి ఆలోచించలేదు. ప్రకృతి గురించి అవగాహన పెరిగేకొద్దీ మృత్యువును గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. నైతిక ...

ఆపద్ధర్మం అంటే ఏమిటి?

ముందు నుయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితిని సంస్కృతంలో ఆపద అంటారు అప్పుడు సాధారణ నియమాలు వర్తించవు ధర్మంతో జోడించి ఆపద్ధర్మ అన్నారు అత్యవసర పరిస్థితిలో వ్యవహరించే పద్ధతి ఇది అదొక తప్పించుకునే మార్గం కరువుకాటకాలు ఏర్పడినప్పుడు ఒక తండ్రి తన తనయుడి ప్రాణం తీయవచ్చు బ్రాహ్మణులు మాంసం తినవచ్చు ఇలా పరిస్థితిని బట్టి చెప్పుకోవచ్చు.          మనవు చెప్పిన నియమాలలో ఇదొకటి ఉంది

దుర్యోధనుడికీ ఒక ఆలయం

      మహాభారతం గురించి తెలిసిన వారికి తప్పకుండా దుర్యోధనుడు గురించి కూడా తెలిసే ఉంటుంది. దుర్యోధనుడు అనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకువస్తుంది. దుర్యోధనుడు అనగానే అతి భయంకరుడు, నీచుడు, దుర్మార్గుడు ఎత్తుకి పై ఎత్తులు వేసే దుష్టిడిగా చెప్పుకుంటారు. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకువస్తుంది. మరికొందరేమో దుర్యోధనుడిని స్నేహానికి అభిమానానికి ప్రతీకగా భావిస్తారు. అయినా కూడా ఆయన్ని కూడా దేవుడిగా కొలుస్తారు. అయితే దుర్యోధనుడు ఎంతటి దుష్టుడైనా ఆయనకు ఓ ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది. అక్కడి ప్రజలు దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం... కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పోరువళి గ్రామంలో మలనాడు అనే ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మింపబడినది. అదే పెరువిరుతి మలనాడ గుడి. మలనాడు కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఈ కొండను మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం! మల నాడ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాదు పచ్చని ప్రకృతికి నిలయాలు. చల్లని గాలి, నేత్రాలకు వ...

భారత కథ

[28/07, 12:03 PM] Pilla Vijay: ధృతరాష్ట్రుని కుమారులు నూరుగురు వారే దుర్యోధనాదులు. వారిని కౌరవులని కూడ అంటారు. పాండురాజు కుమారులు అయిదుగురు ధర్మజ భీమార్జున నకుల సహదేవులు వీరిని పాండవులు అంటారు. పాండురాజు వేటకు వెడుతూ రాజ్యభారాన్ని ధృతరాష్ట్రుడికి అప్పగించిపోయాడు. దురదృష్టవశాన తిరిగిరాలేదు. పాండవులను వెంటబెట్టుకుని కుంతీదేవి మాత్రం తిరిగివచ్చింది. ధృతరాష్ట్రుని కొడుకులు వాళ్ళని నానా హింసల పాలు చేశారు. ఎలాగైనా వాళ్ళని వదిలించుకుని రాజ్యం మొత్తం దక్కించుకొందామని చూశారు. ఆఖరియత్నంగా లక్క యిల్లు ఏర్పాటుచేసి, అందులో వాళ్ళని బూడిద చేద్దామని చూశారు. పాండవులు ఎలాగో ప్రాణాలతో బయటపడ్డారు. ద్రుపదుని కుమార్తెను పరిణయమాడి, ఆ వియ్యం వల్ల మరింత బలపడ్డారు. ధృతరాష్ట్రుడు పాండవులు అక్కడే ఉంటే తనకు, తన బిడ్డలకు ప్రమాదమని గుర్తించి, వాళ్ళను హస్తినకు రప్పించి, ధర్మజుని యువరాజుగా చేశాడు. అంతేకాదు, ఖాండవప్రస్థానికి రాజుగా కూడా చేశాడు. అంతటితో పాండవులు విజృంభించి, తమ బలపరాక్రమాలు ప్రదర్శించి, నాలుగు దిక్కులూ జయిమ్చి, మహావైభవంగా రాజసూయం నిర్వహించి, సార్వభౌములుగా సుప్రతిష్టితులయ్యారు. పాండవుల వైభవం దుర్యోధనుడ...

దుర్యోధనుడికీ ఒక ఆలయం

      మహాభారతం గురించి తెలిసిన వారికి తప్పకుండా దుర్యోధనుడు గురించి కూడా తెలిసే ఉంటుంది. దుర్యోధనుడు అనగానే దుష్టత్వానికి ప్రతీకగా నిలిచే పాత్ర గుర్తుకువస్తుంది. దుర్యోధనుడు అనగానే అతి భయంకరుడు, నీచుడు, దుర్మార్గుడు ఎత్తుకి పై ఎత్తులు వేసే దుష్టిడిగా చెప్పుకుంటారు. అధికారం కోసం ఎంతటికైనా తెగించే దుర్మార్గం గుర్తుకువస్తుంది. మరికొందరేమో దుర్యోధనుడిని స్నేహానికి అభిమానానికి ప్రతీకగా భావిస్తారు. అయినా కూడా ఆయన్ని కూడా దేవుడిగా కొలుస్తారు. అయితే దుర్యోధనుడు ఎంతటి దుష్టుడైనా ఆయనకు ఓ ఆలయమే ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది. అక్కడి ప్రజలు దేవుడిగా ఎందుకు పూజిస్తున్నారన్న విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం... కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో పోరువళి గ్రామంలో మలనాడు అనే ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మింపబడినది. అదే పెరువిరుతి మలనాడ గుడి. మలనాడు కొండ మీదే ఈ దుర్యోధనుడి ఆలయం ఉంది. ఈ కొండను మలనాడ అని పిలుస్తారు. మలనాడ అంటే ఆలయం ఉన్న కొండ అని అర్థం! మల నాడ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాదు పచ్చని ప్రకృతికి నిలయాలు. చల్లని గాలి, నేత్రాలకు వ...

చార్వాక,లోకాయతుల తాత్విక చింతన

Image
_చార్వాక,లోకాయతుల తాత్విక చింతన_       మనకు కనిపించే ప్రకృతి, ప్రపంచం,విశ్వం,జన్మలు, మరణాలు మొదలైన వాటి గురించి చింతన ఉపనిషత్తులలో  మొదలైనప్పటికి  అది భావవాదంలో కూరుకు పోయింది. ఈ ఉపనిషత్తులు 700-500 BCE కాలానికి చెందినవి.బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు శారీరక శ్రమను చాలా నీచంగా చూశాయి. ఉపనిషత్కారులు శారీరక శ్రమ చేసేవారని పందులతో, కుక్కలతో సమానంగా చూశారు. (ఛా.ఉ.5.10.9). వీరు  కనిపించే వాస్తవాన్ని నిరాకరించారు. శారీరక శ్రమను నీచంగా చూశారు.శ్రమ చేసేవాణ్ణి  అసహ్యించుకున్నారు. ఈ మూడు అభిప్రాయాలతో   పాటు ఆత్మ, పరమాత్మ ల సిద్ధాంతం , పునర్జన్మ సిద్ధాంతం ప్రధాన సిద్దాంతాలు గా ప్రవేశ పెట్టారు. అవే అంతిమ సత్యాలుగా, వాటిని గురించి తెలుసుకోవడమే బ్రహ్మ జ్ఞానంగా ప్రచారం చేశారు ఉపనిషత్కారులు.       తాత్విక చింతన  హేతువాదాన్ని, తర్కాన్ని ఆధారం చేసుకొని సాగుతుంది. ప్రతి దాన్ని సంశయించి, ప్రశ్నిస్తుంది. అందుకే మన దేశంలో ఎక్కువగా తాత్వికాంశాలు భావవాదాలుగా ఉన్న దేవుడు, నమ్మకాలు, క్రతువుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే భారతదేశంలో భావవాదంతోప...

రంజాన్‌

పండుగ అంటే శుభవేళ, ఉత్సాహం అని అర్థం. పండుగలు మన భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అది ఏ మతమైనా భారతీయులు కలిసిమెలిసి చేసుకుంటారు. ఒకరి పండుగను ఇంకొకరు గౌరవించుకుంటారు. పండుగ మనుషుల జీవితాల్లో వెలుగు తెచ్చేదిగా, ఆనందాన్నిచ్చేదిగా భావిస్తారు. పండుగ రోజు ఆనందంగా ఉండటం సహజం. ఒక్కో పండుగ ఒక్కో కారణంగా ఏర్పడింది. కాకపోతే ఎక్కువ భాగం రుతువులను బట్టి ఏర్పడినాయి. దీనికి ప్రధాన కారణం పూర్వం (ప్రజలు ప్రకృతిని ఆరాధించటమే. తరువాత కాలక్రమంలో దైవభావన తోడై ప్రతిపండుగకు దేవున్ని స్మరించడం ఒక అలవాటుగా మారిపోయింది. రంజాన్‌ పండుగ ముస్లింలు అత్యంత పవిత్రగంగా జరుపుకొనే పండుగ. ముస్లింలు చంద్రమాన కాలపట్టికను అనుసరిస్తారు. చంద్రమానం (ప్రకారం వచ్చే తొమ్మిదవనెల రంజాన్‌. దీనిని అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. 'ఖురాన్‌' గ్రంథం ఈనెలలో ఆవిర్భవించడం వల్ల ఈనెలను పవిత్రమాసంగా పరిగణిస్తారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మికచింతనల కలయికే “రంజాన్‌ మాసం'. రంజాన్‌కు 'రమదాన్‌” అని కూడాపిలుస్తారు. రమీదా లేదా అద్‌రమద్‌ అనే అరబ్‌ మూలపదం నుంచి రమదాన్‌ అనే పదం వచ్చింది. రంజాన్‌ అనేది రోమన్‌ పదం. ఈనెల £29 నుండి 8౦రోజుల పాటు...

వేద సాహిత్యం _చారిత్రక దృక్పథం

       వేద సాహిత్యం _చారిత్రక దృక్పథం               భారతీయ ప్రాచీన  సాహిత్యం వేద సాహిత్యం తో మొదలవుతుంది. ఇది భారతదేశ ప్రాచీన చరిత్రకు  ఆధారంగా నిలుస్తుంది.  వేద అంటే విజ్ఞానం అని అర్థం. ఇవి నాలుగు .అవి రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. వేదాలు మొదటలో మూడుగా ఉండేవి తరువాత నాలుగుగా విభజించారు 1. రుగ్వేదం (చందోబద్ధ కవితలు లేదా సూక్తాలు) 2. యజుర్వేదం (గద్యంగా ఉండే సూక్తాలు) 3. సామవేదం (గానానికి అనుకూలంగా ఉండే కవితలు) 4. అధర్వణ వేదం (యజ్ఞయాగాదులకు చెందిన శ్లోకాలు) వేద "విధ్"( తెలుసు కోవడం) అనే ధాతువు నుండి  "వేదం" అనే పదం వచ్చింది.వేదాలను  శ్రుతులు (వినబడినవి) అని కూడా పిలుస్తారు.        రుగ్వేదం ఆర్యులకు సంబంధించింది.ఈ  ఆర్యుల విషయంలో చరిత్రకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ఆర్యులు బహుశా బయటి నుంచే భారత ఉపఖండానికి వచ్చి ఉంటారనే విషయం ఇటీవలి డీఎన్ఏ పరిశోధనల్లో వెల్లడైంది.వారి ఆచారవ్యవహారాల్లో వైదిక సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని చాలా మంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బహుశా ఆర్య...

నక్షత్రాలు

అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రావణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాబాద్ర, ఉత్తరాబాద్ర, రేవతి.

తెలుగు సంవత్సరాల పేర్లు. 60

1.ప్రభవ.-1927, 1987, 2047, 2107 2.విభవ.-1928, 1988, 2048, 2108 3.శుక్ల. - 1929, 1989, 2049, 2109 4.ప్రమోదూత. - 1930, 1990, 2050, 2110 5.ప్రజోత్పత్తి. - 1931, 1991, 2051, 2111 6.అంగీరస. - 1932, 1992, 2052, 2112 7.శ్రీముఖ.-1933, 1993, 2053, 2113 8.భావ. - 1934, 1994, 2054, 2114 9.యువ.  - 1935, 1995, 2055, 2115 10.ధాత.  - 1936, 1996, 2056, 2116 11.ఈశ్వర. - 1937, 1997, 2057, 2117 12.బహుధాన్య.-1938, 1998, 2058, 2118 13.ప్రమాది. - 1939, 1999, 2059, 2119 14.విక్రమ. - 1940, 2000, 2060, 2120 15.వృష.-1941, 2001, 2061, 2121 16.చిత్రభాను. - 1942, 2002, 2062, 2122 17.స్వభాను. - 1943, 2003, 2063, 2123 18.తారణ. - 1944, 2004, 2064, 2124 19.పార్థివ. - 1945, 2005, 2065, 2125 20.వ్యయ.-1946, 2006, 2066, 2126 21.సర్వజిత్తు. - 1947, 2007, 2067, 2127 22.సర్వదారి. - 1948, 2008, 2068, 2128 23.విరోధి. - 1949, 2009, 2069, 2129 24.వికృతి. - 1950, 2010, 2070, 2130 25.ఖర. 1951, 2011, 2071, 2131 26.నందన.1952, 2012, 2072, 2132 27 విజయ.1953, 2013, 2073, 2133, 28.జయ. 1954, 2014, 2074, 2134 29.మన్మద.1955, 2015, ...

మనువుకు చోటు - మనిషికి చేటు!

Image
మనువుకూ నేటి కాషాయ పాలకులకూ మధ్య ఉన్న అంతర్గత సంబంధాన్ని కూడా ప్రజలకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. ప్రజా చైతన్యంతో మాత్రమే నాటి మనువును, నేటి ఆ మనువు వాసరసులనూ మనం ఎదుర్కోగలం. వారి కుట్రలను జయించి సమన్యాయాన్ని, స్వేచ్ఛా భారతాన్నీ సాధింగలం. మొత్తం మానవ జాతి తిరస్కరించాల్సిన మనిషి మనువు. విషం సుమీ అతని అణువణువు. అలాంటి విషపు క్రిములను కూడా 'మనీషి'గా భావించి, పూజించే వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. అతని మార్గంలో నడిచే వాళ్ళు, నడవాలని బోధించే వాళ్ళు సైతం మన మధ్యలోనే ఉన్నారు. వాడు రచించిన పరమ దుర్మార్గమైన 'మనుస్మృతి' ఆదర్శంగా భారత శిక్షాస్మృతిని రచించాలని కలలుగనే దుర్మార్గులూ ఇంకా మన మధ్యనే ఉన్నారు. మనతోనే ఉన్నారు.. కాబట్టే పవిత్రమైన హైకోర్టు ప్రాంగణంలో, అందునా ప్రధాన భవనం ఎదురుగా నిలువెత్తు మనువు విగ్రహం చిద్విలాసం చేస్తూ  నిలువ గలిగింది. గత 30ఏండ్లకు పైగా ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క అంగుళం కూడా కదల కుండా ఇంకా అక్కడే అలాగే ఉండగలుగుతోంది.             రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌ నగరంలోని హైకోర్టు ప్రాంగణంలో 31సంవత్సరాల క్రితం 198...

మనుస్మృతే ఆనాటి రాజ్యాంగం

Image
            హిందూ ధర్మ శాస్త్ర గ్రంధం క్రి.పూ. 125-100 కాలానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తారు. సంస్క్రతంలో ఉన్న ఈ గ్రంధాన్ని 1794 లో సర్ విలియం జోన్స్ ఆంగ్లంలోకి అనువదించారు. భారదేశం వర్ణవ్యవస్ధ కలిగిన దేశం. ఇటువంటి వర్ణవ్యవస్ధ అఖండ భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఏ దేశంలోనూ లేదు. భారతసమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సమాజంగా మనుస్మృతి విభజించింది. ఈ వ్యవస్ధ శూద్రులకు విద్య, ధనసంపాదన నిషేదించింది. “ఏ శూద్రుడైనా ధర్మం బోధిస్తే అతడి నోటిలో, చెవుల్లో మరిగించిన సీసం పోయాలి”(మనుస్మృతి 8-272). “అగ్రవర్ణలతో సరిసమానంగా కూర్చోడానికి ప్రయత్నించే శూద్రుని పిరుదులు కోసివేయాలి లేదా ఇనుపకర్రలతో కాల్చాలి” (మనుస్మృతి 8-281) “శూద్రుడు ఆస్తి సంపాదించరాదు” (మనుస్మృతి 10-29). “హీన జాతి పురుషుడు ఉన్నత స్త్రీని తనను వలచినదాననైనను మొహమున పొందునో వానికి ‘లింగచ్చేదము, వధయను’ దండమునకు అర్హుడు” (మనుస్మృతి 8-366). శూద్రులంటే నేటి వెనుకాడిన కులాలు. వీరిని కాలక్రమంలో మహాశూద్రులుగా (బాగా వెనుకబడిన వాళు) అతి శుద్రులుగా (అంటరాని వాళ్ళు) తిరిగి విభజించారు. ఈ మధ్యకాలంలో ...

మనుధర్మ శాస్త్రం_మహిళలు

Image
స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా కొందరి చేత వ్రాయబడినదని కొందరు అభిప్రాయబడ్డారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని వారు అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ  ఉండటానికి  కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలపై  మనుధర్మ శాస్త్రం బలవంతంగా రుద్దడం వల్ల అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు బైబిల్లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు.స్టార్ మా టివిలో 'అగ్నిసాక్షి ' అనే సీరియల్ మనుస్మృతి డాక్ట్రిన్ ఆధారంగా నిర్మించినదే.

మనుస్మృతి గురించి కొంత

Image
          రఘ వంశం రెండో సర్గ లో  దిలీప మహారాజు ధర్మపత్ని దక్షిణాదేవి వేదార్థాన్ని స్మృతి మాదిరిగా నందినీ ధేనువు వెళ్ళే దారిని అనుసరించిందని కాళిదాసు వర్ణించారు. (....మను ష్వేశ్వర ధర్మపత్ని శ్రుతేరి వార్థం స్మృతి రస్వగచ్ఛత్). శృతి అందే వేదం. స్మృతి అంటే ధర్మశాస్త్రం.           “వేదో ధర్మ మూలం" అన్నాడు గౌతముడు. సమస్త ధర్మాలకూ వేదమే మూలం. ఆ వేద ధర్మాన్ని ప్రతిపాదిస్తూ శాసించేది ధర్మశాస్త్రం. ఇది వేదంతో సమానమై పధ్నాలుగు విద్యల్లో ఒకటయింది         ధర్మశాస్త్రం ధర్మాన్ని తెలుపుతుంది. జైమిని "చోదనా లక్షణోర్థో ధర్మః"అని చెప్పాడు. చోదన అంటే పురికొల్పటం అని అర్థం. వ్యక్తి చేయదగిన విధుల్ని బోధించేది ధర్మం. ధర్మాలు సామాన్యమనీ, విశేషమనీ రెండు రకాలు. సత్యం, అహింస, దయ, శౌచం మొదలయిన వన్నీ సామాన్య ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాలు విశేష ధర్మాలు.            భారతదేశంలో ధర్మశాస్త్రాలు చాలా ప్రాచీనమైనవి. మానవసమాజంతోనే సామాన్య విశేష ధర్మాలు రూపొందాయి. సమాజం స్థాణువు కాదు కాబట్టి, పరిణామం చెందే తత్వం ...

పురాణాల ప్రాచీనత

Image
            పురాణాల ప్రాచీనత                 మనదేశ లిఖిత చరిత్ర అంతా పురాణాల్లో నిండిపోయింది. అయుతే ఆ పురాణాలలో  కర్మకాండలు, ధార్మిక విషయాలకు సంబంధించినవే ఉన్నాయి. పురాభవ ఇతిపురాణం అన్నారు. అంటే పురాణాలు ప్రాచీన కాలానికి చెందిన అంశాలు చెపుతాయని అర్ధం. పురాణాల్లో చెప్పే ప్రాచీనతను పురావస్తు పరిశోధనలు కనుక్కోవడానికి ప్రయత్నించారు. పురాణాలను మతధార్మిక విషయాలను శాస్త్రీయ దృష్టితో పరిశీలించి పునర్మూ ల్యాంకనం చేయాల్సిన అవసరం వుంది.              ప్రాచీన మైనవని ఎంతగా చెప్పినప్పటికీ పురాణాలలో  ఆధునిక విషయాలు ఉన్నాయి. రుగ్వేదంలోని కవితల్లో ఉన్న రెండు లైన్ల కథలకు పురాణాలు విస్తృత రూపాన్నిచ్చాయి.         పురాణాలు 18. ఉపపురాణాలు 18 ఉన్నాయి. కానీ 22 మరో పురాణాలు, లెక్కలేనన్ని ఉపపురాణాలు కూడా ఉన్నాయి. పురాణాలను సంస్కృతంలో రాశారు. వాటిని తెలుగులోకి చాలా మంది కవులు అనువ దించారు. వేములవాడ భీమకవి అనువ దించిన నృసింహ పురాణాన్ని మొదటి అను వాదంగా భావిస్తున్నార...

నూతన విద్యా విధానంలోని ముఖ్యాంశాలు

Image
 పిల్లలకు 3వ ఏడు రాగానే... ‘చిన్నారుల సంరక్షణ - విద్య (ఈసీసీఈ) మొదలవుతుంది. ప్రస్తుతం ఆరోఏట 1వ తరగతిలో చేరుతున్నారు. ఈ పద్ధతిని మార్చేసి... 3 నుంచి 18 ఏళ్ల వయసు వచ్చేదాకా... 5+3+3+4 పద్ధతిలో చదువు సాగుతుంది. 15 ఏళ్ల చదువులో... తొలి మూడేళ్లు అంగన్‌వాడీ లేదా ప్రీస్కూల్‌ బోధన ఉంటుంది. ఇది... 3-8 ఏళ ్ల వరకు, 8-11 ఏళ్ల వరకు, 11-14 ఏళ్ల వరకు, 14-18 ఏళ్ల వరకూ చదువుకునే విధంగా విద్యావిధానాన్ని రూపొందించారు. స్కూలు విద్య 12 ఏళ్లకే పూర్తయినప్పటికీ తొలి మూడేళ్లు అంగన్‌వాడీ లేదా ప్రీస్కూలింగ్‌ విద్యాబోధన ఉంటుంది. పిల్లల శారీరక, మానసిక వికాసంతోపాటు... మొత్తంగా సామాజిక, ఆర్థిక, భావోద్వేగ, నైతిక, సాంస్కృతికమైన అభివృద్ధి, కళలపట్ల ఆసక్తి, భావ ప్రకటన సామర్థ్యంలో అభివృద్ధి సాధించాలన్నది ఈసీసీఈ లక్ష్యం. దీనికి అనుగుణంగా 8 ఏళ్ల వయసు పిల్లలకు అవసరమైన కరిక్యులంను ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తుంది. ఈసీసీఈలో చదువు ఆసక్తికరంగా సాగుతుంది. కళలు, కథలు, కవితలు, ఆటలు, పాటలు.... ఇలాంటి అంశాలను తగిన విధంగా సిలబస్ లో చేర్చుతారు. ఈసీసీఈని సమర్థంగా అమలు చేసేందుకు వీలుగా... అంగన్‌వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, ప్రీ...