Posts

Showing posts from July, 2021

వశిష్టుడు

హిందూ పురాణాలలో ఒక గొప్ప రుషి వశిష్టుడు. మహాతపస్సంపన్నుఁడు. సప్త రుషులలో వసిష్ఠ మహర్షి కూడా ఒకరు.  వేదాల ప్రకారం ఇతను మిత్ర , వరుణా దంపతుల కుమారుడు. సూర్యవంశానికి రాజపురోహితుడు.   అందరు మహర్షులలాగా ఈయన ఒంటరి వాడు కాదు. ఈయన  అరుంధతిని వివాహమాడాడు. వీరికి 100 మంది కుమారులు కలిగారు. వారిలో శక్తి మహర్షి జేష్టుడు. ఈతని భార్య అదృశ్యంతి.  శక్తి మహర్షి పుత్రుడే పరాశరుడు.  వశిష్ఠుడు కుమారులుగా చిత్రకేతువు, పురోచిషుడు, విరచుడు, మిత్రుడు, ఉల్భకుడు, వసుబృద్ధాకుడు, ద్యుమన్తుడు ఉన్నారని ప్రసిద్ధ గ్రంథాల వలన తెలుస్తోంది. మరో కథనం ప్రకారం వశిష్టుడు దక్షప్రజాపతి కూఁతురైన  ఊర్జను వివాహమాడతాడు. ఆమె ద్వారా రజుఁడు, గోత్రుఁడు, ఊర్ధ్వబాహువు, సవనుఁడు, అనఘుఁడు, సుతపుఁడు, శుక్రుఁడు అని ఏడుగురు పుత్రులను పొందాడు. వారు స్వాయంభువ మన్వంతరమున సప్తర్షులుగ ఉండిరి. ఇతఁడు తొలుత బ్రహ్మమానసపుత్రుఁడు. నిమి శాపంతో మరణిస్తాడు. మిత్రావరుణులకు మరల జన్మిస్తాడు.  ఒకసారి మిత్ర, ఊర్వశిని చూచి వీర్య స్ఖలితమవుతుంది. అది ఒక కుంభమునందు చేర్పఁబడఁగా అందుండి వసిష్ఠుఁడు, అగస్త్యుఁడు పుడతారు.ఇక్కడ కుం...

మతంగులు

మతంగుడు (మతంగ మహర్షి) గౌతమ వంశానికి చెందిన బ్రాహ్మణుడు. అతను మంచి గుణాలు కలిగి నీతిమంతుడై, వేదశాస్త్రాలన్నీ చదువుకొని యజ్ఞకర్మలు చేసాడు.   " ఓ బ్రాహ్మణుడా, నీ తల్లి కామంతో ఒక క్షురకుని వలన నిన్ను కన్నది. కనుక నీవు బ్రాహ్మణుడివి కాదు"అని దారిని పోయే దానయ్య అన్నాడు. తండ్రితో జరిగిన విషయమంతా చెప్పి, అసలు నిజం చెప్పాలని అడిగాడు. తాను  బ్రాహ్మణుడు కానని తెలుసుకున్నాడు. ఇంద్రుని దగ్గర కు వెళ్లి మతంగుడు తనకు బ్రాహ్మణత్వం ప్రసాదించమని అడిగాడు. అపుడు ఇంద్రుడు "బ్రాహ్మణత్వము ఎలా సిద్ధిస్తుందో నీకు తెలుసా ! ఇంతకంటేపది రెట్లు తపస్సు చేస్తే కాని ఒక  చంఢాలుడు   శూద్రుడు  కాలేడు. దాని కంటే నూరు రెట్లు తపస్సు చేస్తే కాని శుద్రుడు  వైశ్యుడు  కాలేడు. దాని కంటే వేయిరెట్లు తపస్సు చేసిన కాని వైశ్యుడు  క్షత్రియుడు  కాలేడు. దాని కంటే పది వేల రెట్లు తపస్సు చేసిన కాని క్షత్రియుడు దుర్మార్గుడైన  బ్రాహ్మణుడు  కాలేడు. దానికంటే లక్షరెట్లు తపస్సు చేస్తే కాని దుర్మార్గు డైన బ్రాహ్మణుడు ఇంద్రియములను, మనస్సును జయించి, సత్యము అహింసలను పాటించి, మాత్సర్యము వ...