మనుధర్మ శాస్త్రం_మహిళలు
స్త్రీ సాధికారత ఫలితంగా ఏర్పడిన మహిళా సంఘాలు మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాయి. మనుధర్మ శాస్త్రం మహిళలను కించపరచేలా కొందరి చేత వ్రాయబడినదని కొందరు అభిప్రాయబడ్డారు. భారతీయ సమాజము పురుషాధిక్య సమాజమని వారు అభిప్రాయ పడుతున్నారు. శూద్ర కులాల వారిని మనుధర్మ శాస్త్రం చిన్న చూపు చూసిందని పెక్కు విమర్శలున్నాయి. భారత దేశ రాజ్యాంగం ప్రజలందరికీ కులాలకు అతీతంగా సమాన హక్కులు ఇచ్చింది. అందువల్ల మనుధర్మ శాస్త్రము బ్రాహ్మణ, క్షత్రియ వైశ్య కులాలవారికి తప్ప ఇతర కులాల వారికి అధర్మ శాస్త్రంగా కనిపిస్తుంది. ఆర్యుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉండటానికి కారణం వృత్తిని బట్టి కుల విభజన అయితే మరో కారణం ఆనాటి ప్రజలపై మనుధర్మ శాస్త్రం బలవంతంగా రుద్దడం వల్ల అని చెప్పవచ్చు. మనుస్మృతిలోని మనువు బైబిల్లోని పాతనిబంధనలో నోవాహుకి సాదృశ్యంగా కనిపిస్తాడు.స్టార్ మా టివిలో 'అగ్నిసాక్షి ' అనే సీరియల్ మనుస్మృతి డాక్ట్రిన్ ఆధారంగా నిర్మించినదే.
Comments
Post a Comment