మూఢనమ్మకాలకు తావులేని శాస్త్రీయ దృక్పథం



మూఢనమ్మకాలకు తావులేని శాస్త్రీయ దృక్పథం

మనుషులలో ఏర్పడిన భేదాలు మనం సృష్టించుకున్నవేనని అది బోధిస్తుంది. అదేవిధంగా ఒకరు దేవుడి పుత్రులు, మరొకరు సామాన్యులు అనే అసమా నతలను తిరస్కరించి, సమానత్వాన్ని బోధించే నూత్న తాత్వికతను అభివృద్ధి పరుస్తుంది. ఇది ఎంతో వివేచనతో సమాజాన్ని ఆవిష్కరించిన ఘట్టం. బౌద్ధం విశ్వమానవ మతంగా రూపొందడానికి ఉన్న తాత్విక పునాది ఇది. ఇందులో ఎక్కడా మూఢనమ్మకాలకు తావు లేదు. విశ్వపరిణామ క్రమాన్ని ఎంతో సూక్ష్మదృష్టితో పరిశీలించిన బుద్ధుడు ఆ కాలపు విజ్ఞాన ఖనిగా దర్శన మిస్తాడు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసిన మాట నిజమే కావచ్చు. అక్కడ ఆయనకు జ్ఞానోదయం కలుగవచ్చు. కానీ అది కళ్లు మూసుకొని ధ్యానం చేయడం వల్ల సాధ్యమైందనేది అబద్ధం. ఆయన తన ఇంటిని వదిలిపెట్టి వెళ్లాక మనిషి పుట్టుక, జీవనం, మరణాలపై జరుగుతున్న చర్చలన్నింటినీ విన్నాడు. వాటన్నిటినీ అర్థం చేసుకుని, క్రోడీకరించి తన దైన ఒక తాత్వికతను సృష్టించుకున్నాడు. అందువల్లనే ఆనాటి సమాజంలో తప్పుగా ప్రచారమవుతున్న దేవుడు, సృష్టి, జననం, మరణం అనే అంశా లనూ, ప్రత్యేకించి ప్రముఖంగా ప్రచారమవుతున్న అసత్యాలనూ ఆయన తన తాత్విక పరిశోధనలో నిగ్గుతేలిన సత్యాలతో తిప్పికొట్టిన వైనానికి అగ్గన్న సుత్త అద్దం పడుతుంది.

మల్లెపల్లి లక్షయ్య

Comments

Popular posts from this blog

మహాత్మా గాంధీ ఆచరణాత్మక తాత్విక చింతన

బాబాసాహెబ్ అంబేద్కర్‌ ఆధునిక తాత్విక చింతన

బౌద్ధం పునాదులపై లేచిన వైదిక ధర్మం